Inspiration

పీఎం కిసాన్ నిధి కింద మరో రూ. 2 వేలు!

PM KISAN Nidhi : రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. 2024 ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పెంచుతున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా రూ. 6 వేలు ఇస్తుండగా, ఈ మొత్తాన్ని రూ.8 వేలకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు  ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏటా రూ.6 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేస్తుంది. ఈ మొత్తానికి అదనంగా మరో రూ.2 వేలు రైతులకు అందించనుందని తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ.20 వేల కోట్ల అదనపు భారం పడనుంది. దేశంలో 140 కోట్ల మందిలో దాదాపు 65 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.