ఏపీ బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధాన్యం..

27
Aug
ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చింది. వై.ఎస్.ఆర్. రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం నిధులతో కలిపి మూడు విడతలలో రూ.13,500 ఆర్థిక సహాయాన్ని రైతులకు సకాలంలో ప్రభుత్వం అందజేస్తోందని మంత్రి బుగ్గన తెలిపారు. వాస్తవ సాగుదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు, కౌలుదారులకు, అటవీ హక్కుల క్రింద గుర్తించబడిన భూమిని సేద్యం చేస్తున్న (ఆర్.ఓ. ఎఫ్. ఆర్. ) గిరిజన రైతు కుటుంబాలకు అందజేస్తున్నామన్నారు. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ప్రత్యక్ష నగదు బదలీ విధానం ద్వారా రూ.27,063 కోట్లు అర్హులైన రైతు కుటుంబాల ఖాతాలలో జమ చేశామన్నారు. ఈ పథకం క్రింద 52.38 లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.4,020 కోట్లు ప్రతిపాదించారు.
Social Chat is free, download and try it now here!